subhodayam.news
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 2:01 pm Digital Edition : Narendhar

మానాల మోహన్ రెడ్డిని సన్మానించిన జిల్లా ఉపాధ్యక్షులు

బాల్కొండ: తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్ రెడ్డి ని ఆయన  జన్మదినం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు చాట్ల నరేష్ శాలువాత ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

బాల్కొండలో మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
బాల్కొండ మండల కేంద్రంలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్ రెడ్డి  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాల్కొండలోని మహతి ఆశ్రమంలో పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, మానాల మోహన్ రెడ్డి  ఎప్పుడూ ప్రజా సేవలో ముందుండి పనిచేస్తూ, పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.