subhodayam.news
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 8:26 am Digital Edition : Subhodayam.news Desk

ట్రంప్ నిర్ణయంతో ఊపిరి పీల్చిన ప్రపంచం…

ఇరాన్ కు విధించిన గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొడిగించారు. తమతో డీలు చేసుకోవడానికి ఇరాన్ కు విధించిన డెడ్ లైన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు ట్రంప్ నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే పాకిస్తాన్ అభ్యర్థన మేరకు 14 రోజులపాటు దాడులు నిలిపివేస్తున్నట్టు అంగీకరించారు.

హార్మూజ్ ను తెరిచేందుకు ఇరాన్ ఒప్పుకునే షరతు మీదనే ఈ గడువు పొడిగించానని, ఈ సీజ్ ఫైర్ రెండువైపులా వర్తిస్తుందని, ఇరాన్ 10 పాయింట్ల ప్రపోజల్ పై ఆలోచిస్తున్నట్టు తెలిపినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు బ్రేకింగ్ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. “ఒక సంపూర్ణ నాగరికత ఈ రాత్రి ( మంగళవారం సాయంత్రం) నాశనం కావచ్చు, అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు” అంటూ ట్రంపు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని గజ గజ వణికించాయి. ఇక మూడో ప్రపంచ యుద్ధం తప్పదని అంతా భయపడగా.. ట్రంప్ తాజా నిర్ణయంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.