తెలంగాణ మొదటి ఉద్యమకారుడు సతీష్ కు నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు
ఆర్మూర్: భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్ మండల సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ గారి అధ్యక్షతన నందిపేట్ మండల కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. మొదటగా అకాల మరణం చెందిన పార్టీ కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సతీష్ కి శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. అనంతరం పార్టీ బలోపేతం గురించి చర్చించి రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సమిష్టి కృషితో విజయం సాధించాలని వచ్చే పార్టీ...