Date of Publish : 30 March 2026, 1:37 pmDigital Edition : Narendhar
బాల్కొండలో హిందూ సమ్మేళనానికి భారీ ఏర్పాట్లు
బాల్కొండ: భారతదేశ ప్రాణప్రదమైన హిందూ ధర్మ పరిరక్షణ, సమైక్యతను మరింత ఇనుమడింపా చేస్తూ దేశాన్ని విశ్వ గురువుగా నిలిపే బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఈనెల 4వ తేదీన బాల్కొండలో భారీగా హిందూ సమ్మేళనం నిర్వహించడానికి నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బాల్కొండలోని ఎబినగర్ రోడ్ లో ఉన్న ఎంకే గార్డెన్లో జరిగే ఈ సమ్మేళనంలో ప్రధాన వక్తగా అప్పల ప్రసాద్, విశోక తీర్థ స్వామి, హరాచారి నారాయణస్వామి లు పాల్గొంటారని హిందూ సమ్మేళనం సమితి అధ్యక్షులు మందారం శంకర్, ప్రధాన కార్యదర్శి కత్రాజి నరేందర్ తెలిపారు.