subhodayam.news
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 7:11 am Digital Edition : Narendhar

ఉల్లాస్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి, ఏపీఎం గంగారం

రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం 2020లో భాగంగా ‘ఉల్లాస్’(అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆన్ ఇన్ ది సొసైటీ )అనే కొత్త ప్రోగ్రామ్ లో
ఉల్లాస్ పరీక్ష కేంద్రా లను ఏపీఎం గంగారంతో కలిసి మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ తనిఖీ చేసారు.  పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగాయని  మండల విద్యాశాఖ పరిధిలోని ఉల్లాస్ పరీక్షా కేంద్రాలను సందర్శించి, ఏర్పాట్లను, అభ్యాసకుల హాజరును పర్యవేక్షించారు. ఉల్లాస్ పరీక్షలకు వయోజన అభ్యాసకులు పెద్ద సంఖ్యలో, అనగా సుమారు 1405 మంది ఉత్సాహంగా పరీక్షలకు హాజరయ్యారు కిసాన్ నగర్ గ్రామంలో ఆ గ్రామ సర్పంచి రామరాజు గౌడు పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు కార్యక్రమంలో అన్ని గ్రామాల సీసీలు మరియు వివో ఏలు తదితరులు పాల్గొన్నారు.