అంగ రంగ వైభవంగ వన్నెల్ (కే) రామాలయంలో సీతారాముల కల్యాణ వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కళ్యాణం కమనీయంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ అనంతరం గ్రామ ప్రజలకు అన్నప్రసాదాన్ని అందజేశారు.