Date of Publish : 27 March 2026, 7:36 amDigital Edition : Narendhar
చలువ పందిళ్ళ మధ్య సీతారాముల కళ్యాణం
చలువ పందిళ్లు… మేళ తాళాలు… వేదమంత్రాలతో పురోహితులు అభిజిత్ లగ్న ముహూర్తంలో భక్తులే కన్యాదాతలుగా శుక్రవారం నిజాంబాద్ జిల్లాలో ని పలు రామాలయాల్లో సీతారాముల కళ్యాణం అంగరంగా వైభవంగా కనుల విందుగా జరిగింది. జిల్లాలోని ఖిల్లా రామాలయం, శ్రీరామ్ సాగర్ కోదండ రామాలయం, రేంజర్ల రామాలయం, ముప్కాల్ పడిలేచిన మర్రిచెట్టు ఆలయం, కిసాన్ నగర్ రామాలయం, బాల్కొండ లోని పోచమ్మ గల్లి మహాలక్ష్మి ఆలయం వద్ద సీతారాముల కళ్యాణం అంగరంగా వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారాములను పలువురు భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదం కార్యక్రమం జరిగింది. శ్రీరామ్ సాగర్ రామాలయం లో జరిగిన కళ్యాణ వేడుకల్లో ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ విప్ ఇరవత్రి అనిల్, కాంగ్రెస్ పార్టీ సెగ్మెంట్ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.