subhodayam.news
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 8:48 am Digital Edition : Narendhar

జీతాల కోసం మిషన్ భగీరథ సిబ్బంది నిరసన

బాల్కొండ :బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలో మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరాలో పనిచేస్తున్న లైన్‌మెన్‌లు, సిబ్బంది తమకు రావాల్సిన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. మిషన్ భగీరథ పంప్ హౌస్ గేట్ ముందు నిలబడి సిబ్బంది తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే బకాయిలు చెల్లించాలని వారు కోరారు. జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని సిబ్బంది తెలిపారు. ఈ నిరసనలో సూపర్వైజర్ నాగరాజ్, విఘ్నేష్, నరేందర్, గంగాధర్, సుదీర్, సతీష్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.